|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 08:12 PM
సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీగా రఘునందన్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎస్పీ పరితోష్ పంకజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 1995లో ఎస్ఐగా ఎంపికైన రఘునందన్ రావు, తెలంగాణ పోలీస్ అకాడమీలో డిఎస్పీగా విధులు నిర్వహించారు. ఇటీవల ఏఎస్పీగా పదోన్నతి పొంది సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. నూతన అదనపు ఎస్పీని కార్యాలయ సిబ్బంది సన్మానించారు.