|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 12:02 PM
వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గడిసింగాపూర్ గ్రామానికి చెందిన కోడూరు మల్లమ్మ(68)కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అంజయ్య కొంతకాలంగా తాగుడుకు బానిసై తల్లితో పింఛన్ డబ్బుల కోసం గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా వాగ్వాదం జరగ్గా.. ఆవేశంతో ఉన్న అంజయ్య తల్లిని దారుణంగా కొట్టాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మల్లమ్మ మరణించింది.