|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:43 PM
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా వ్యవహారంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కవిత భావోద్వేగంతో రాజీనామా చేసి ఉండవచ్చని, అందుకే పునరాలోచించుకోవాలని తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కారణంగానే ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరిగిందని పరోక్షంగా తెలిపారు.గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి, కవిత రాజీనామా అంశంపై స్పష్టత ఇచ్చారు. "నా రాజీనామాను ఆమోదించాలని కవిత నాకు ఫోన్ చేశారు. అయితే, ఆ తర్వాత ఈ విషయం మళ్లీ నా దృష్టికి రాలేదు. పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఎమోషనల్గా రాజీనామా చేశారు కాబట్టి, మరోసారి ఆలోచించుకోవాలని నేను ఆమెకు చెప్పాను" అని గుత్తా వివరించారు. కవిత రాజీనామాపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.