|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 08:55 PM
టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ కార్యాలయాన్ని సందర్శించారు. తెలుగు రాష్ట్రాలకు అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సాదర స్వాగతం పలికిన లారా విలియమ్స్, ఈ భేటీకి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. "జూనియర్ ఎన్టీఆర్కు మా కాన్సులేట్కు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది," అని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ప్రాజెక్టులు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని ఆమె కొనియాడారు."అమెరికాలో చిత్రీకరించిన ఆయన తాజా, రాబోయే ప్రాజెక్టులు భాగస్వామ్య శక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాటి వల్ల ఉద్యోగాల కల్పన జరగడమే కాకుండా, భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత పటిష్ఠమవుతున్నాయి" అని లారా విలియమ్స్ తన పోస్టులో వివరించారు. ఎన్టీఆర్తో కలిసి దిగిన ఫోటోను కూడా ఆమె ఈ సందర్భంగా షేర్ చేశారు.'ఆర్ఆర్ఆర్' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం గ్లోబల్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.