|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 02:07 PM
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటించారు. వార్డులలో నెలకొన్న పలు సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో పర్యటించిన ఆయన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.