![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 08:50 PM
ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. హన్వాడ మండలంలోని వేపూరు, లింగన్నపల్లి, గొండ్యాల, కిష్టంపల్లి తాండా, ఎర్రగట్టు తాండా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దసరా పండుగకి అందరూ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయాలని సూచించారు.