![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 08:21 PM
బనకచర్ల ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదని, గతవారం బనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్ను ఇంకా పరిశీలించలేదని, గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగొద్దని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఏ విధంగా నష్టం జరుగుతుందో.. కేంద్రానికి లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.