![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 01:31 PM
తుళ్లూరు గ్రామ గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం 2025 శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా లైబ్రేరియన్ టీ. గిరిధర్ కుమార్ మాట్లాడుతూ, శిబిరం ద్వారా విద్యార్థులకు పఠన అలవాట్లు పెంపొందించేందుకు ప్రయత్నించామని తెలిపారు.
ఈ ముగింపు కార్యక్రమంలో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. రాంబాబు, ఉపాధ్యాయులు ప్రకాశరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా భావించాలనీ, విద్యార్థులు చదవడం పై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.
"చదవడం మా కిష్టం" పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విద్యార్థులు చక్కగా వినియోగించుకున్నారని లైబ్రేరియన్ తెలిపారు. విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశంగా ఈ శిక్షణ శిబిరం నిలిచిందని వ్యాఖ్యానించారు.