![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 01:22 PM
ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ కామారెడ్డి ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జ్యోతి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు సహాయం కోరగా, మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ టీం స్పందించింది.
శుక్రవారం ట్రస్ట్ అంబులెన్స్ సేవ ద్వారా జ్యోతిని, ఆమె నవజాత శిశువును కామారెడ్డి ఆసుపత్రి నుంచి తిమ్మాపూర్ గ్రామానికి సురక్షితంగా తరలించారు. ఈ సేవకు కృతజ్ఞతలు తెలుపుతూ జ్యోతి కుటుంబం ట్రస్ట్కు ధన్యవాదాలు తెలిపింది.