![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:36 PM
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కమిషన్ నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాటకం ఆడుతున్నాయని, ఈ నోటీసులు ఆ నాటకంలో భాగమేనని ఆరోపించారు. ఈ నోటీసులను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 17 నెలల పాలనలో కమీషన్లు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్పై నోటీసులు జారీ చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హామీలైన ఆరు గ్యారంటీలు, తులం బంగారం, రూ. 4 వేల పెన్షన్ హామీలు ఏమయ్యాయని నల్గొండలో జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.