|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 10:26 AM
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ లడ్డు ప్రసాదంలో పురుగు ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.