![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:32 PM
సోన్ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు లాభాలు, సౌకర్యాలు అందుతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా బుధవారం ఏఈఓ ఉమా మహేశ్వరి మాట్లాడుతూ, “ఫార్మర్ రిజిస్ట్రేషన్ వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వారికి అవగాహన కల్పిస్తున్నాం,” అని తెలిపారు. రైతులంతా తమ హక్కుల కోసం ఈ ప్రక్రియను బాధ్యతగా పూర్తి చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
రైతులు తమ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా పట్టా పాస్ బుక్ మరియు ఆధార్ కార్డుతో తమను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సకాలంలో పూర్తి కావడానికి రైతుల సహకారం అవసరమని పేర్కొన్నారు.