![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:45 PM
భారత్, రష్యాల మధ్య రక్షణ రంగంలో సహకారం అంతకంతకూ బలపడుతోందని, ముఖ్యంగా పాకిస్థాన్పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో 'మేడ్ ఇన్ ఇండియా' రక్షణ పరికరాల సమర్థత నిస్సందేహంగా రుజువైందని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ స్పష్టం చేశారు. అయన మాట్లాడుతూ.....ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢపడ్డాయి. మనం కేవలం సైనిక పరికరాలను కొనడం, అమ్మడం మాత్రమే కాదు, రక్షణ ఉత్పత్తుల సంయుక్త అభివృద్ధి మరియు ఉత్పత్తిలోనూ పాలుపంచుకుంటున్నాం. భారత్లో తయారైన బ్రహ్మోస్ (రష్యా-భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ యాంటీ-షిప్ క్షిపణి) వంటి ఆయుధాలు తమ సామర్థ్యాన్ని అనేకసార్లు నిరూపించుకున్నాయి. ముఖ్యంగా మే 7 నుంచి 10వ తేదీ మధ్య జరిగిన ఆపరేషన్ సమయంలో ఇది స్పష్టమైంది. కాబట్టి, ఈ రంగంలో మన సంబంధాలు మరింత వృద్ధి చెందుతాయని నేను నమ్ముతున్నాను అని అంబాసిడర్ వినయ్ కుమార్ తెలిపారు.