|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 11:30 AM
‘కాంతార-2’ సినిమా షూటింగ్ సమయంలో కర్ణాటకలోని మస్తికట్ట వద్ద ప్రమాదం జరిగింది. రాత్రివేళ నటుడు రిషబ్ శెట్టి సహా 30 మందికి పైగా ఉన్న పడవ బోల్తా పడింది. అయితే అందరూ క్షేమంగా ఈత కొట్టి ఒడ్డుకు చేరినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో షూటింగ్కు తీసుకెళ్లిన కెమెరాలు, ఇతర పరికరాలు నీటిలో మునిగిపోయినట్టు సమాచారం.అదృష్టం కొద్ది ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. అందరూ క్షేమంగా ఒడ్డుకు ఈత కొట్టుకుంటూ వచ్చేశారు. అయితే, షూటింగ్ కోసం తీసుకెళ్లిన కెమెరాలు, ఇతర వస్తువులు నీటిలో మునిగిపోయాయి. వరుస విషాదాలు, ప్రమాదాలతో భయంతో ఉన్న సినిమా టీమ్ను పడవ బోల్తా ఘటన మరింత భయాందోళనకు గురిచేస్తోంది.
Latest News