![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 07:22 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే విడుదలైన 'పుష్ప 2' తో భారీ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు నటుడి తదుపరి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఒక ప్రాజెక్ట్ కోసం జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ప్రకటన వీడియో అపారమైన సెన్సేషన్ ని సృష్టిస్తోంది. అట్లీ ఇప్పటికే ప్రాజెక్ట్ కోసం పూర్తి స్క్రిప్ట్ను పూర్తి చేసారు. ఈ చిత్రం శక్తివంతమైన డాన్ చుట్టూ తిరుగుతుంది మరియు మాఫియా నేపథ్యం ఉంది అని సమాచారం. ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్స్ లో నటిస్తున్నట్లుసమాచారం. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకి యువ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ సౌండ్ట్రాక్ను స్కోర్ చేయనున్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
Latest News