![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:16 PM
ప్రముఖ డైరెక్టర్ త్రివికమ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'ఖలేజా' మే 30న రీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ ఐకానిక్ చిత్రం దాని ప్రారంభ విడుదల సమయంలో ఆశించిన స్థాయిలో ప్రదర్శించలేదు మరియు ఇది పెద్ద ప్లాప్ గా నిలిచింది. ఖలేజా ప్రేక్షకులలో కల్ట్-క్లాసిక్ హోదాను సంపాదించింది. రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ భారీ నోట్ మీద ప్రారంభమయ్యాయి. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా బుక్ మై షోలో 100K+ టికెట్స్ అమ్ముడయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాకి మణి శర్మ ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి మహిళా ప్రధాన పాత్ర పోషించగా, ప్రకాష్ రాజ్ విరోధి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కోట శ్రీనివాస్ రావు, అలీ, సునీల్, బ్రహ్మానందం, సుబ్బరాజు, రఘు బాబు మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు.
Latest News