![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 10:39 AM
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ను తెరకెక్కించనున్నారు. కలాం అనే పేరును కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కలాం పాత్రలో తమిళ హీరో నటించనున్నారు. ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో టైటిల్ పోస్టర్ను విడుదల చేసింది. పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ మూవీని అనిల్ సుంకర్, అభిషేక్ అగర్వాల్, భూషణ్ కుమార్, క్రిషాన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన డాక్టర్ కలాం ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. రాకెట్ శాస్త్రంలో నిష్ణాతుడిగా, అలుపెరగని ఆశావాదిగా ఆయన ప్రసిద్ధులు. 'మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన ఆయన, నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి గొప్ప ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా, దార్శనికుడిగా, ప్రజల రాష్ట్రపతిగా ఎదిగారు. ఆయన ఆత్మకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్' నేటికీ ఎన్నో తరాలకు ప్రేరణనిస్తోంది. ఈ చిత్రంలో డాక్టర్ కలాం పాత్రలో ధనుష్ కనిపించనుండటం విశేషం. 'ఆదిపురుష్' చిత్రంతో వార్తల్లో నిలిచిన ఓం రౌత్ ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు.
Latest News