![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 08:19 AM
జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు ధనుష్ ఇండియా మాజీ అధ్యక్షుడు ఎపిజె అబ్దుల్ కలాం బయోపిక్ కోసం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్తో జతకట్టారు. ఈ చిత్రానికి 'కలాం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్లైన్ తో ఈ చిత్రం రానుంది. మేకర్స్ ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ ప్రకటన అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఈ చిత్రం కోసం స్క్రీన్ ప్లే సైవిన్ క్వాడ్రాస్ రాశారు. ఈ బయోగ్రాఫికల్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ మరియు అనిల్ సుంకర సంయుక్తంగా టి-సిరీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ రానున్న రోజులలో వెల్లడి చేయనున్నారు.
Latest News