|
|
by Suryaa Desk | Tue, Oct 10, 2023, 08:39 AM
ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందనీ, రామాయణంలో పాత్రలను వక్రీకరించారని కొందరు కేసులు పెట్టారు. తాజాగా వాటన్నింటినీ కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మతానికి సంబంధించిన కొందరి మనోభావాలు దెబ్బ తీేసలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. హనుమంతుడి సంభాషణల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్ర నిర్మాతపై కేసులు పెట్టారు. ఈ చిత్రంపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక.. ఏ విషయంలోనూ విచారణలు అవసరం లేదు. వీటికి ముగింపు పలకండి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై వివిధ కోర్టులో జరుగుతున్న వాదనలు అన్ని వ్యర్థమైనవని కోర్టు పేర్కొంది. ఈ వివాదంపై జరుగుతున్న విచారణలన్నీ అనవసరమైనవని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సోమవారం వ్యాఖ్యానించారు.
Latest News