|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 11:19 AM
TG: 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ చేపట్టాయి. దిల్సుఖ్ నగర్లో బీసీ ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొని ఆర్టీసీ బస్ డిపోల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పలు ప్రైవేటు బస్సులను కూడా అడ్డుకోవడంతో పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులు, బీసీ నేతల మధ్య వాగ్వాదం తలెత్తి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.