|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 12:36 PM
గత నెల 14న పీఏసీఎస్ల పదవీకాలం ముగియడంతో, కొన్నింటిని ఆరు నెలలు పొడిగించి, మరికొన్నింటి పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు, నిర్వహణ లోపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని, పర్సన్ ఇన్చార్జ్లను నియమించింది. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, చేగొమ్మ, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, పోచారం పీఏసీఎస్ల పాలకవర్గాలను రద్దు చేయగా, ఆయా చైర్మన్లు తమను కూడా కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.