|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 02:38 PM
తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కేసీఆర్ నగర్ ఇళ్ల పట్టాల తనిఖీ సమయంలో ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని పటాన్చెరు బీఆర్ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ కోరారు. సమాచారం ఇవ్వకుండా తనిఖీ చేయడం వల్ల ఉద్యోగులు, ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆయన అభ్యర్థించారు.