|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 02:53 PM
తెలంగాణ నూతన విద్యా విధానం రూపకల్పన పై సమీక్ష. తెలంగాణలో పేద, మధ్యతరగతి పిల్లలకు . అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని నేను వ్యక్తిగతంగా గట్టి సంకల్పంతో ఉన్నాను. ఈ విషయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధం. విద్యా విధానం లో సమూల మార్పులు, ప్రక్షాళన జరిగి తీరాల్సిందే. ప్రతిపాదిత నూతన విద్యా పాలసీ కేవలం విద్యా వ్యవస్థలో మార్పు తేవడం మాత్రమే కాదు… పేదరిక నిర్మూలన సాధించేలా ఉండాలి. విద్యారంగంలో గతంలో ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయి. ఏడాదికి 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతుంటే… వారి లో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. నాణ్యత, నైపుణ్యత కొరవడటం సమస్యకు కారణం. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని నేను బలంగా నమ్ముతున్నాను. విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకురావడమే నా ధ్యేయం. నూతన విద్యా పాలసీ ఆ దిశగా రూపకల్పన జరగాలి. మేధావులు, విద్యాధికుల నుండి సూచనలు, సలహాలు తీసుకుని కొత్త పాలసీ రూపొందించాలి. ఈ పాలసీ దేశ విద్యా వ్యవస్థకు ఆదర్శంగా ఉండాలి. 73 లక్షల మంది యువత కు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా తపన.
ఒకటి నుంచి 12వ తరగతుల వరకు సమూల మార్పులు రావాలి. విద్య విషయం లో సమాజానికి మేలు జరుగుతుందంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా నేను సిద్ధం. ఈ సమీక్షలో ఎంఎల్సీ శ్రీ కోదండరాం, శ్రీ కె కేశవ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, శ్రీ ఆకునూరి మురళి, శ్రీ శ్రీపాల్ రెడ్డి, శ్రీ ఏవీఎన్ రెడ్డి, శ్రీ మల్క కొమరయ్య,విద్యావేత్తలు,అన్ని యూనివర్సిటీ ల వైస్ చాన్సలర్స్ లు. ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీమతి యోగితా రాణా, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ శ్రీ బాల కిష్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.