![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 03:32 PM
కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. లబ్ధిదారుల జాబితాలో వారి రేషన్ కార్డు నంబర్తో పాటు కుటుంబ వివరాలను నమోదు చేయబోతున్నామన్నారు. రేషన్ కార్డుల ముద్రణ ప్రక్రియ కొనసాగుతోందని, అది పూర్తి అయిన వెంటనే భౌతికంగా కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.