![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:13 PM
నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలో ఎఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం జరిగే అఖిల భారత సమ్మెలో మండలంలోని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.