![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:36 PM
పాశమైలారం పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.