|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 10:38 AM
కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించి సందడి చేశారు. పాల్వంచ మండలం కిన్నెరసానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 599 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్ లైఫ్ శాఖకు రూ. 33, 145 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ. 22, 000 ఆదాయం లభించింది.