![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 03:28 PM
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడో వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బ్రహ్మోత్సవ కార్యక్రమం, యాగ యజ్ఞము, ఆశీర్వచనము, అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం అందించి ప్రత్యేక పూజ విశిష్ట అభిషేక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు.ఆ లక్ష్మీ నరసింహని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్రానికి మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, కొండూరు గ్రామ మాజీ సర్పంచ్ ప్రభాకర్, భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్, వెల్మల్ రాజన్న, నక్కల భూమేష్, ముత్యం సుభాష్ గౌడ్,రామారావు, శ్రీనివాస రావు, సంతోష్, సాయన్న, బోగన్న, తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.