వరంగల్ లో మహిళా స్టాళ్ల నిర్మాణానికి భూమి పుజ, కౌన్సిల్ సమావేశం ప్రారంభం
Wed, May 06, 2026, 12:46 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 11:27 AM
ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో మంగళవారం ఉదయం చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. డ్రైనేజ్, నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలోని 20 వార్డులలో రోజు పర్యటన ఉంటుందని, ప్రజలు నేరుగా సమస్యలు చెప్పవచ్చని, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. జోగిపేట మున్సిపాలిటీని అభివృద్ధిలో జిల్లాలోనే నంబర్ వన్ గా నిలబెడతామని ఆయన పేర్కొన్నారు.