|
|
by Suryaa Desk | Sun, Oct 05, 2025, 06:52 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమీషన్లు దండుకోవడానికే ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి డ్రామాలకు తెరలేపిందని విమర్శించారు.రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెబుతూ, మరోవైపు మూసీ సుందరీకరణకు ఏకంగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దారుణమని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది కేవలం కమీషన్ల కోసమే చేపట్టిన పథకమని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీశ్ రావును చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, ఆ భయంతోనే ఆయనపై నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.