![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 08:12 PM
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి రావాలంటూ మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ మేరకు గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.