|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 03:27 PM
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన ఫార్ములా- ఈ కార్ రేసు నిర్వహణ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నేడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఆయన హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు.ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయినట్టు తెలిసింది. బంజారాహిల్స్లోని నందినగర్లో కేసీఆర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరోవైపు, కేటీఆర్కు మద్దతు తెలిపేందుకు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయన నివాసానికి తరలివచ్చారు. వీరిలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, పటోళ్ల కార్తీక్రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే, తెలంగాణ భవన్కు కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.