![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 05:27 PM
సంగారెడ్డి పట్టణ బైపాస్ రహదారిపై ఉన్న ప్రభుత్వ స్థలాల్లో కొందరు అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని ఆరోపిస్తూ, వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రతినిధులు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అదనపు కలెక్టర్ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణ నుంచి కాపాడాలని ఫోరం డిమాండ్ చేసింది.