![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:58 PM
ఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భార్యతో కలిసి ఖర్గేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రివర్గంలో చోటు కల్పించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపిన వివేక్ కుటుంబం, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. సమావేశం సాన్నిహిత్య వాతావరణంలో సాగినట్టు తెలిసింది.