![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:53 PM
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జీ వజ్రేష్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సరెడ్డి బూ పతి రెడ్డి కూడా ఆయనతో కలిసి ఉన్నారు.
నాయకులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో కలిసి పలు పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గాల పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అందరూ కలిసి అల్ఫాహారం చేశారు.