![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 07:23 PM
తెలంగాణలో మూసీ నది అభివృద్ధి చేయకూడదా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మూసీ ప్రాంత ప్రజల కష్టాలు BRS, BJPలకు కనిపించడం లేదా? అని ఆయన మండిపడ్డారు.
"నా జన్మదినం రోజు కూడా మూసీ ప్రాంత ప్రజల కష్టాలను చూసేందుకు వచ్చాను. వాళ్ల బాధలు ప్రత్యక్షంగా చూశాను. మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం అన్న హామీ నేను ఇచ్చాను. గుజరాత్లో సబర్మతి, ఉత్తరప్రదేశ్లో గంగా, యమునా నదులను అభివృద్ధి చేశారు. అప్పుడు మూసీ నదిని ఎందుకు అభివృద్ధి చేయకూడదు?" అంటూ ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళన తెలంగాణ ప్రజలకో అవసరం అని స్పష్టంచేశారు సీఎం రేవంత్. ఈ విషయంలో ఎలాంటి రాజకీయం అవసరం లేదని, ఇది సామాన్యుల సమస్య అని వివరించారు.