![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 07:13 PM
లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం యాదాద్రి జిల్లా తిరుమలాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
"గతంలో యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చారు. అయితే, మేము అధికారంలోకి వస్తే మళ్లీ యాదగిరిగుట్టగా మార్చుతామని హామీ ఇచ్చాం. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాం," అని సీఎం పేర్కొన్నారు.
భక్తుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఆలయ అభివృద్ధికి అనుగుణంగా వివిధ పనులు చేపట్టామని తెలిపారు. అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. ప్రజలకు సహాయపడే అభివృద్ధి పథకాలను అమలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.