![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 07:00 PM
తెలంగాణలో రేషన్ వ్యవస్థలో సంస్కరణల దిశగా కీలక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా తిరుమలాపూర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, “ఇది ఆలేరుకు చారిత్రాత్మక రోజు” అని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వాల పాలనలో రేషన్ ద్వారా సరఫరా చేసే బియ్యం 80 శాతం ప్రజలు వాడకపోయే స్థితిలో ఉండేదని గుర్తుచేసిన మంత్రి, అప్పట్లో కాకినాడ నుంచి బియ్యం తరలించి తెచ్చే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యంను ప్రజలకు అందిస్తోందని, ఇది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు.
ఇక అభివృద్ధి పనుల విషయానికొస్తే, ఒకే నియోజకవర్గంలో రూ. 1,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు సాగుతున్నాయన్న మంత్రి ఉత్తమ్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేస్తోందని స్పష్టం చేశారు.