![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:59 PM
గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబు శుక్రవారం పరామర్శించారు. మధ్యాహ్నం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి.. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.