![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 07:28 PM
గోషామహల్లో బీఆర్ఎస్ నేత కవిత నిర్వహించిన ధర్నాపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత ధర్నా స్వార్థపూరితమని, తన తండ్రి కేసీఆర్కు దగ్గర కావడానికి ఆమె ఈ డ్రామా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
దయాకర్ మాట్లాడుతూ, "కాళేశ్వరం కాదు, ఇది కులేశ్వరం ప్రాజెక్టు. ఇది తాగునీటి పథకం కాదు, మట్టి తినిపించే పథకం. NDSA ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపింది" అని అన్నారు. కేసీఆర్ హయాంలో కట్టిన ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరగలేదని ఆరోపించారు.
"కవిత ధర్నాను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆమె తండ్రి కేసీఆర్కు మార్కులు కొట్టించేందుకు, ప్రజల్లో మాయచేసేందుకు బీఆర్ఎస్ నాటకం చేస్తోంది" అని దయాకర్ అన్నారు.