![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 04:14 PM
సన్న రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని బుధవారం బీజేపీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 500 బోనస్ రైతులకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, వెంకటేశ్వరరావు, గాంధారి శ్రీనివాస్, కాసోజి ప్రతాప్, మహేష్, గంగమల్లయ్య, గడ్డం జీవన్ రెడ్డి, ఆనంద రెడ్డి, రాజం, తదితరులు పాల్గొన్నారు.