జడ్చర్లలో గ్రామ పంచాయతీ కార్మికుల అరెస్టులు.. హక్కుల కోసం పోరాటం ఆపబోదాం
Fri, Jun 27, 2025, 04:01 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 07:28 PM
హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. నగరంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు త్వరలో పెరగనున్నాయి. ఛార్జీలను పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. సవరించిన నూతన ఛార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది.ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10 ఉండగా, దానిని రూ.12కి పెంచారు. అదేవిధంగా, గరిష్ఠ ప్రయాణ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి పెరగనుంది. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా ఛార్జీల శ్లాబులను సవరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పెరిగిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి