|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 07:28 PM
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి పేరు మార్మోగిపోతుంది. ఇప్పటికే తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో జైలులో రిమాండ్లో ఉంది. అంతేకాక అఘోరి శ్రీవర్షిణి కన్నా ముందే తనను పెళ్లి చేసుకుందంటూ మొదటి భార్య రాధిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పైగా ఇప్పటికి కూడా అఘోరి ఆడా.. మగా అనే అంశంపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రిమాండ్లో ఉన్న అఘోరిపై మరో కేసు నమోదయ్యింది. ఈసారి అత్యాచారం కేసు ఫైల్ కావడం గమనార్హం. ఈ కేసు కరీంగనర్ జిల్లా, కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. ఆ వివరాలు..
లేడీ అఘోరి రి తనకు బలవంతంగా తాళి కట్టిందని.. అంతేకాక తనపై అత్యాచారం ప్రయత్నం కూడా చేసిందంటూ ఓ యువతి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సనాతన ధర్మం పేరుతో అఘోరి బాధితురాలితో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత తనను ట్రాప్ చేసి.. ప్రేమించానని మాయ మాటలు చెప్పిందని బాధితురాలు ఆరోపించింది. అంతటితో ఆగక.. తనను బలవంతంగా కొండగట్టు తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టిందని పోలీసులకు తెలిపింది. ఆపై తనపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నం చేసిందని.. తన ప్రైవేట్ పార్ట్స్పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది.
అంతటితో ఆగకుండా తనను బెదిరించి రూ.3 లక్షల రూపాయలు తీసుకుందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ బెదిరించిందని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరీపై 64(1), 87 318(4) 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక మోసం కేసులో ఇప్పటికే పోలీసుల రిమాండ్లో ఉన్న అఘోరిని ఈ కేసుకు సంబంధించి కూడా విచారించే అవకాశముంది అంటున్నారు.
హైదరాబాద్కు చెందిన ఓ మహిళ ఇటీవల అఘోరిపై మోకిలా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాంత్రిక పూజల పేరుతో తన వద్ద రూ.9.5 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన మోకీలా పోలీసులు.. అఘోరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. మరోవైపు అఘోరికి మెుదటి భార్య తానేనంటూ రాధిక అనే మహిళ ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటూ.. అఘోరీ.. శ్రీవర్షిణి అనే యువతిని సైతం పెళ్లి చేసుకుంది. అఘోరి లీలలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. ఇంకెంతమంది బాధితులు బయటకు వస్తారో చూడాలి మరి అంటున్నారు జనాలు.