|
|
by Suryaa Desk | Thu, Jun 12, 2025, 12:52 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌలి యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా పై భారీ హైప్ ఉంది. ఈ సినిమాలో ప్రముఖ లేడీ ప్రియాంక చోప్రా జోనాస్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ మరియు ఒడిశాలో రెండు ప్రధాన షెడ్యూల్లను పూర్తి చేసుకుంది మరియు మూడవ షెడ్యూల్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపేర్ట్స్ ప్రకారం, శంషాబాద్ వద్ద భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. SSMB29 ను ప్రముఖ చిత్రనిర్మాత కెఎల్ నారాయణ 1,000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త MM కీరావాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్కు చెందిన కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. దేవా కట్ట డైలాగ్ రైటర్ గా, విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్ మార్చి 25, 2027న విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Latest News