|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:59 PM
సినిమాలో మాటలు రాయడం కంటే పాటలు రాయడమే అత్యంత కష్టమైన పని అని త్రివిక్రమ్ అభిప్రాయపడ్డారు. దర్శకనిర్మాతలు ఒకలా ఆలోచిస్తే, సిరివెన్నెల అంతకు మించి లోతుగా ఆలోచించి, పాట ఎప్పటికీ నిలిచిపోయేలా రాయాలని తపించేవారని తెలిపారు. "‘పట్టుదల’ సినిమాలోని ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే పాట ఇప్పటికీ సినిమాతో సంబంధం లేకుండా ఆదరణ పొందుతోంది. అలాంటి గొప్ప సాహిత్యం ఆయన సొంతం" అని త్రివిక్రమ్ వివరించారు. ‘జల్సా’ సినిమాలోని ‘చలోరే చలోరే..’ పాట కోసం తాము దాదాపు 20 రోజులకు పైగా చర్చించుకున్నామని, చర్చలు ముగిసిన వెంటనే సిరివెన్నెల ఆ పాటను వేగంగా రాసిచ్చారని గుర్తుచేసుకున్నారు. "ఆ పాటను ఆయన ఏకంగా 34 పేజీలు రాశారు. కానీ మేం అందులో రెండు పేజీలు కూడా పూర్తిగా వాడుకోలేదు" అంటూ ఆయన రచనా పటిమను కొనియాడారు.
Latest News