|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 12:59 PM
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల పాఠశాలలో చుట్టూ భారీగా వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు.. అక్కడికి చేరుకుని విద్యార్థులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.