|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 02:21 PM
రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల కోసం కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఈ రోజుతో తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. చివరి రోజు కావడంతో దరఖాస్తుదారుల నుంచి భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.గత వారం బీసీ బంద్, కొన్ని బ్యాంకులకు సెలవులు ఉండటంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని పలువురు విజ్ఞప్తి చేయడంతో, ఎక్సైజ్ శాఖ గడువును మరో రెండు రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ గడువు రెండు రోజుల క్రితమే ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల సౌకర్యార్థం అక్టోబర్ 23 వరకు పొడిగించారు.అక్టోబర్ 18 నాటికి 89,344 దరఖాస్తులు రాగా, బుధవారం సాయంత్రం నాటికి ఆ సంఖ్య 90,316కు చేరింది. చివరి రోజున దరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు, హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆన్లైన్తో పాటు, నిర్దేశిత కౌంటర్లలోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఈసారి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన తర్వాత, ఈ నెల 27న లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు.