![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 03:55 PM
తనపై హత్యాయత్నం జరిగిందని, ఈ విషయంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. కవిత అనుచరుల విధ్వంసాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఆదివారం క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈరోజు మండలి చైర్మన్ను కలిసిన మల్లన్న దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనుచరులు క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చి చేసిన విధ్వంసాన్ని చైర్మన్కు వివరించానని తెలిపారు. డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని ఆయన వెల్లడించారు. కార్యాలయంపై దాడి నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని చైర్మన్ను కోరానని తీన్మార్ మల్లన్న తెలిపారు.కవితపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. దాడి ఘటనపై విచారణ జరుపుతామని మండలి చైర్మన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. కవిత బీసీ నినాదం వినిపించడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. బీసీల కట్టుబాట్లు, పదజాలం ఏమిటో కవితకు తెలియదని వ్యాఖ్యానించారు. బీసీల రాజకీయాన్ని నిలువరించాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నినాదం ఎత్తుకున్నారని ఆరోపించారు.