![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 04:22 PM
TG: బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక తన ఫోన్, తన భార్య ఫోన్ను ట్యాప్ చేసి బెదిరించారని అన్నారు. గత ఎన్నికల సమయంలో రెండు వారాలు బెంగళూరుకు పారిపోయి హోటల్లో ఉన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాపింగ్ కేసులో కీలకమైన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.