![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:41 PM
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన కొట్రంగి పోషన్న అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్టు సమాచారం అందడంతో, పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. తాళ్ల గురిజాల ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంటి పెరటిలో మొత్తం 8 గంజాయి మొక్కలను ఆ వ్యక్తి పెంచుతున్నట్టు గుర్తించారు.
పోషన్న వాటిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు, మొక్కలను తొలగించి, పోషన్నపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.